అనంతాళ్వాన్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వవరవరమునయే నమ:
శ్రీ వానాచల మహా మునయే నమ:

ananthazhwan

తిరు నక్షత్రము : మేష మాసము, చిత్రా నక్షత్రము

అవతార స్థలము : సిరుపుత్తూరు / కిరన్గనూరు ( బెంగళూరు – మైసూరు మార్గములో)

ఆచార్యులు : అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్

పరమపదించిన స్థలము : తిరువేంకటమ్(తిరుమల)

రచనలు : వేంకటేశ ఇతిహాసమాల, గోదా చతుః శ్లోకి, రామానుజ చతుః శ్లోకి

శిష్యులు– ఏచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి.

వారికి అనంతాచార్యర్, అనంత సూరి మొదలగు నామధేయములు ఉన్నవి. ఎంపెరుమానార్ గురించి తెలుసుకొని వారి శ్రీపాదములను ఆశ్రయించాలని కోరికతో వారిని చేరారు. ఆ రోజులలోనే యఙ్ఞమూర్తిని సంస్కరించి వారికి అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ అను నూతన నామధేయాన్ని ఏర్పరిచారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ శిష్యులు కమ్మని అనంతాళ్వాన్ను ఎంపెరుమానార్ ఆదేశమిచ్చారు. ఉభయులు ఆనందముతో అంగీకరించారు. కాని అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్  సౌహృదయముతో పేరుకే నేను ఆచార్యుడైనను నా శిష్యులందరు ఎంపెరుమానార్ శ్రీపాదాలనే శిరోధార్యముగా భావిస్తారని ప్రకటించారు. కావుననే తిరుమల లో ఎంపెరుమానార్ శ్రీపాదములను (శ్రీశఠారిని) అనంతాళ్వాన్ అని వ్యవహరిస్తారు.

అనంతాళ్వానులకు మధురకవి ఆళ్వార్కు గల పోలికలను పరిశీలిద్దాము:

  • ఉభయుల తిరునక్షత్రం మేష మాసము, చిత్రా నక్షత్రము.
  • ఉభయులు ఆచార్యనిష్ఠలో పరిపూర్ణులు

తిరువాయ్మొళి లో “ఒళవిళ్ కాలమెల్లాం” పదిగములోని (3.3.1) అమృత తుల్యమైన పాశురమునకు వ్యాఖ్యానము చెపుతున్న సమయములో నమ్మాళ్వార్ శ్రీ వేంకటేశ్వరునికి చేయదలచిన పుష్పకైంకర్యము గురించి ఎంపెరుమానార్ వివరించారు. అదే సమయాన శ్రోతలను చూసి” ఎవరైన తిరుమలలో అందమైన పూతోటలను పెంచి శ్రీ వేంకటేశ్వరునికి పుష్ప కైంకర్యము చేసి నమ్మాళ్వార్ కోరికను తీర్చగలవారు ఉన్నారా?” అని ప్రశ్నించారు. వెంటనే అనంతాళ్వాన్ లేచి ” తమరి ఆనతితో దాసుడు తమరి కోరికను నమ్మాళ్వార్ కోరికను నెర వేర్చుటకు సిద్ధమని విన్నవించుకున్నారు. అది విన్న ఎంపెరుమానార్ అమితానందముతో ఆనతిచ్చి తిరుమలకు పంపారు. అనంతాళ్వాన్ తిరుమల చేరుకొని స్వామికి మంగళాశాసనములు చేసి తోటను పెంచి “ఇరామానుశన్” అని నామ ధేయమును ఉంచి ఎంపెరుమానార్ కోరిక మేరకు పుష్ప కైంకర్యము చేయసాగారు. అది తెలిసిన ఎంపెరుమానార్ తిరుమలేశుని దర్శనార్థం తిరువాయ్మొళి కాలక్షేపం త్వరగా ముగించి తిరుమలకు బయలుదేరారు.  ఎంపెరుమానార్ కాంచీపురము మీదుగా ప్రయాణించి దేవపెరుమాళ్ళకి, తిరుకచ్చి నంబికి మంగళాశాసనము చేసుకొని తిరుపతికి చేరుకున్నారు. వీరిని ఆహ్వానించుటకు అనంతాళ్వాన్ మరి కొందరు శ్రీవైష్ణవులతో కూడి కొండ క్రిందకు వచ్చారు.

తిరుమల స్వయంగా ఆదిశేషుని అవతారమని ఎంపెరుమానార్ కొండ పైకి వెళ్ళుటకు ఇష్ఠపడలేరు. కాని అనంతాళ్వాన్ తదితరుల కోరిక మేరకు బయలుదేరారు. తిరుమల నంబి స్వయముగా ఆహ్వానించుటకు ఎదురారాగా,  ఎంపెరుమానార్ తోటకు వెళ్ళి  అక్కడ అనేకరకాల పూలమొక్కలను చూసి ఎంతో సంతోషముతో తిరుమంగై ఆళ్వార్ పాశురమైన “వళర్ తాడానాళ్ పయన్ పెత్తెన్” (పరకాలయకి  తన పెంపుడు చిలుక నారయణుని నామాలు పలకడం చూసి సంతోషముతో పాడిన పాశురం) పాశురమును గుర్తుకు చేసుకున్నారు. అంతాళ్వాన్ కృషిని, అంకిత భావనను చూసి చాలా సంతోషించారు.

ఒకసారి అనంతాళ్వాన్ భార్య నిండుగర్భణిగా ఉన్నప్పుడు ఇద్దరు తోట పని చేస్తున్నారు. ఆమె అవస్థను చూడలేక వేంకటేశుడు కిన్న బాలుడిలా వచ్చి సహాయము చేయబోతే, అనంతాళ్వాన్   మా ఆచార్యులు ఆఙ్ఞానుసారం మేమే ఈ పనిని చేయాలి నీ సహాయము అవసరం లేదని చెప్పి పంపారు. ఆ బాలుడు చూడ కుండా ఆమె చేతిలోని మట్టి తట్టను తీసుకొని దూరంగా పోసాడు. అది తెలిసి అనంతాళ్వాన్ కోపముతో ఆ బాలుణ్ని వెంబడించాడు.

ananthazhwan-art1

ఆ బాలుణ్ణి అందుకో లేక చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. అది ఆ బాలుని గడ్దానికి (చుబుకానికి) తగిలింది. ఆ బాలుణ్ణి డిని అందుకోబోగా అంతలో దేవాలయములోనికి వెళ్ళి మాయమయ్యాడు. సాయంకాలం దేవాలయానికి వెళ్ళిన అనంతాళ్వాన్కు స్వామి చుబుకము నుండి రక్తం రావడం కనిపించినది. అప్పుడు విషయం అర్థమైంది అనంతాళ్వాన్కు. వెంటనే పచ్చ కర్పూరము అద్దారు. నేటికి ఆ సాంప్రదాయము మేరకు స్వామి చుబుకానికి పచ్చ కర్పూరము అద్దడం జరుగు తుంది.

ఒక సారి అనంతాళ్వాన్కు ఒక పాము కరచినది.తోటి వారందరు ఎంతో ఆందోళన పడ్డారు.  కాని అనంతాళ్వాన్  నిర్భయంగా “నన్ను కరచిన పాము బలముగలదైతే ఈ శరీరాన్ని విడచి విరజా స్నానము చేసి, పరమపదమును చేరి అక్కడ స్వామికి కైంకర్యమును చేస్తాను. కరచిన పాము కంటే ఈ శరీరము బలముగలదైతే ఇక్కడే ఉండి స్వామి పుష్కరిణిలో స్నానము చేసి తిరుమలేశునికి కైంకర్యము చేస్తాను” అని అన్నారు.

ananthazhwan-snake

మరొకసారి అనంతాళ్వాన్ ప్రసాదాన్ని మూట కట్టుకొని  దానిని తీసుకొని పొరుగూరికి బయలుదేరారు. కొండ దిగి నడుస్తూ దారిలో ప్రసాదమును తిందామని మూట విప్పారు. దానిలో కొన్ని చీమలు కనిపించాయి, వెంటనే తన శిష్యులని కొండ ఎక్కి ఆ మూటలోని చీమలను తిరుమలలో వదిలి రమ్మన్నారు . అలా ఎందుకు చేశారంటే కుళశేఖరాళ్వార్ తన పెరుమాల్ తిరుమొళి” తిరుమలైయిలే ఎడునావేన్” (తిరుమలలో ఏదో ఒకటి అవుతానని) అన్నారు. “బహుశా ఈ చీమలు వారే అయితే కొండ క్రింద వదలడం ఎంత అపచారము చేసిన వారమవుతాము”  అని  తన శిష్యులతో అన్నారు.

ananthazhwn-ants

ఇంకొకసారి అనంతాళ్వాన్ పూమాల కడుతున్న సమయములో ఒక స్వామి  వచ్చి “శ్రీనివాసుడు మిమ్ములను రమ్మన్నారు” అని చెప్పాడు. వీరు పని పూర్తిచేసుకొని వెళ్ళగా శ్రీనివాసుడు” ఆలస్యమయింది తమరికి” అని అడిగారు దీనికి వీరు “పూలు పూర్తిగా విచ్చుకోక ముందే మాల కట్టాలి, మా ఆచార్యులు ఆఙ్ఞ అయిన ఈ కైంకర్యము కంటే వేరేదేది ఈ సన్నిధిలో నాకు లేదు” అన్నారు.

“మేము మిమ్ములను ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆఙ్ఞాపిస్తే” అన్నాడు శ్రీనివాసుడు.

“మీరు తిరుమలకు నాకంటే కొంచెం ముందుగా వచ్చారు. నేను మా ఆచార్యుల ఆనతి మీద వచ్చాను. నన్ను వెళ్ళి పోమని మీరెలాగ అనగలరు?” అని అన్నారు అనంతాళ్వాన్.

ananthazhwan-srinivasan

వీరి ఆచార్య నిష్ఠను చూసి స్వామి ఎంతో మురసి పోయారు.

అనంతాళ్వాన్ శ్రీసూక్తులను వారి ఔనత్యాన్ని వివిధ వ్యాఖ్యానముల నుండి కొన్నింటిని పరిశీలిద్దాము.

పెరియాళ్వార్ తిరుమొళి 4.4.1 కి మణవాళ మాముణుల వ్యాఖ్యానము.

నావకారియం శొల్లిలాదవర్ నాల్ దొరుం విరుందోమ్బువార్
దేవకారియం శెయ్ దు వేదం  పయిన్ఱు వాళ్ తిరుకోట్టియూర్
మూవకారియము తిరుత్తుం ముదల్వనై చిందియాద
అప్పావకారిగళై పడైత్తవన్ ఎఙ్ఞనం పదైత్తాంగొలో  

ఈ పాశురంలో తిరుకోష్ఠియూర్లో ఉన్న వాక్ శుద్ధి గల శ్రీవైష్ణవులు తమ ఆచార్యులకు ప్రియమైన విషయాలు తప్ప మరొకటి మాట్లాడరు అని  పెరియాళ్వార్ పేర్కొన్నారు. పాశురమునకు మాముణులు వ్యాఖ్యానము చేస్తు  అనంతాళ్వాన్కు  భట్టర్ మీద ఉన్న అభిమానమును ఈవిధంగా పేర్కొన్నారు.

అనంతాళ్వాన్ అంతిమ సమయంలో భట్టర్ కు ప్రియమైన శ్రీవైష్ణవులతో “ఏ నామము భట్టర్ కు  ప్రియమైనది” అని అడిగారు. దానికి వారు “అళగియ మణవాళన్” అని చెప్పగా విని “భర్త పేరును భార్య చెప్పడము శాస్త్ర సమ్మతము కానప్పటికిని భట్టర్ కు ప్రియమైన నామము కదా! అదే చెప్పుకుంటాను” అని  “అళగియ మణవాళన్” అనుంటూనే పరమపదించారు.

పూర్వాచార్యులు పేర్కొన్న అనంతాళ్వాన్ శ్రీసూక్తులను  కొన్నింటిని చూద్దాము.

నాచ్చియార్ తిరుమొళి 7.2 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం

ఈ పాశురములో ఆండాళ్ పాంచజన్యము యొక్క వైభవమును ఈ విధంగా తెలిపినది. పుట్టింది సముద్రములో, నివాసం శ్రీమన్నారాయణుని శ్రీ హస్త కమలముల్లో. సందర్భముగా పెరియ వాచ్చాన్ పిళ్ళై – అనంతాళ్వాన్  మరియు నంజీయర్ మధ్య జరిగిన ఒక సంఘటనను చెప్పారు. వేదాంతి (పూర్వాశ్రమములో నంజీయర్  కు వేదాంతి అని పేరు)

భట్టర్  చేత సంస్కరించ బడిన తర్వాత  తన సంపదను మూడు భాగములుగా చేసి తన భార్యలిద్దరికి చెరొక్కటి ఇచ్చి మూడవది తమ ఆచార్యులకు సమర్పించారు. సన్యసించి ఆచార్య కైంకర్యము చేసుకోవడానికి శ్రీరంగమును చేరుకొన్నారు. ఈ విషయం తెలిసిన  అనంతాళ్వాన్ “మీరు గృహస్థాశ్రమమును కొనసాగించి ఉండవలసినది. అక్కడే ఉంటు ఆధ్యాత్మిక విషయములను అర్థం చేసుకుంటు, ఆచార్య భాగవత కైంకర్యము చేసి ఉండ వలసినది. ఎందుకు సన్యాసాశ్రమమును స్వీకరించారు?” అక్కడ ఉన్న ఇతర శ్రీవైష్ణవులు ‘అలా ఎందుకు చెపుతున్నారు’ అని అడిగారు. “భాగవతుడైన వాడు తిరు మంత్రములో పుట్టి ద్వయ మంత్రములో పెరగాలి” అన్నారు అనంతాళ్వాన్.

  • నాచ్చియార్ తిరుమొళి 12.5 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం : ఈ పాశురములో గో పగోపికలు శ్రీ కృష్ణుడు కాళీయుడు మీద కెక్కి నాట్యము చేస్తున్నాడని వినగానే స్పృహ తప్పి పడిపోయారని ఆండాళ్  పాడారు. ఒకసారి  అనంతాళ్వాన్ శ్రీ గుహ దాసర్తో కలసి ఎంపెరుమానార్లను సేవించు కోవడానికి వెళుతున్నారు. శ్రీరంగం చేరుకోగానే కొందరు ఏకాంగులు శిరోముండనం చేసుకొని కావేరి నుండి వస్తూ కనపడ్డారు. వారిని చూసి విషయ మేమని విచారించగా, ఎంపెరుమానార్   పరమపదించారని చెప్పారు. ఇది విన్న నంబి గుహ దాసర్ పక్కన ఉన్న చెట్టెక్కి దూకి చనిపోవాలనుకున్నారు. అది చూసిన అనంతాళ్వాన్ “ఎంపెరుమానార్   పరమపదించారని తెలియగానే పోని ప్రాణము చెట్టెక్కి దూకితే పోతుందా, కాళ్ళు చేతులు విరుగుతాయి అంతే” అని అన్నారు.
  • పెరుమాళ్ తిరుమొళి 4.10 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఈ పాశురములో కులశేఖరాళ్వార్ తిరుమలపై ప్రీతిని ప్రకటించుకున్నారు. తిరుమల మీద ఏదో ఒక వస్తువుగా పడి ఉన్న చాలని తలచారు. అదే అనంతాళ్వాన్ వేంకటేశుని  దగ్గరనైన ఉండటానికి అభ్యంతరం లేదన్నారు. అదే తిరుమలతో వారికున్న సంబంధము.
  • పెరుమాళ్ తిరుమొళి 4.10 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఈ పదిగములో తిరుమంగై ఆళ్వార్  పరకాల నాయకిగా తిరువేంగడం గురించి తపించి “వేంగడమే వేంగడమే” అని ఆ దివ్య దేశము మీది ప్రీతిని చాటుకున్నారు. భట్టర్  శ్రీరంగనాథుని “అళగియ మణవాళన్ ” అన్నట్లుగా, అనంతాళ్వాన్ శ్రీనివాసున్ని ” తిరువేంగడముడయాన్” అని పిలిచారు అని నంజీయర్ అన్నారు.
  • *తిరువాయ్మొళి 6.7.1 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పదిగంలో నమ్మాళ్వార్ , వైత్తమానిధి ఎంపెరుమాన్ మీద, తిరుక్కోళూర్ దివ్య దేశము మీద తమ ప్రీతిని చాటు కున్నారు. నంపిళ్ళై , అనంతాళ్వాన్ దివ్య దేశ వాసము గురించి చెప్పిన ఒక సంఘటనను వివరించారు. చోళ కులాంతకం అనే ఊరిలో  శ్రీవైష్ణవులో వ్యవసాయం చేస్తు కనబడగా, వారి స్వస్థలమేదని అడిగారు అనంతాళ్వాన్. దానికి వారు “మాది తిరుక్కోళూర్, అక్కడ ఉపాధి దొరక నందున ఇక్కడకు రావల్సి వచ్చినదని” బదులు చెబుతారు దివ్య దేశవాసము వదలుకొని ఇక్కడ రావటం కన్నా ఎంపెరుమానార్  మరియు నమ్మాళ్వార్లకు ఎంతో ఇష్ఠమైన తిరుక్కోళూర్లో నివాసముతో వారికి కైంకర్యము చేస్తు జీవించడానికి గాడిదలము పెంచు కొని సంపాదించవచ్చు” అని  అనంతాళ్వాన్ అన్నారు. దీని వలన  దివ్య దేశవాస శ్రీవైష్ణవ  కైంకర్యము ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది.
  • తిరువాయ్మొళి 6.7.1  నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పదిగంలో నమ్మాళ్వార్ , పరాంకుశ నాయకిగా పెరుమాళ్ళకు ఒక పక్షి ద్వారా సందేశమును పంపుతుంది. ఈ సందేశమును పెరుమాళ్ళకు విన్నవిస్తే నీకు ఈ లోకము, పరమపదము ఇస్తానని  వాగ్ధానం   చేశారు. (ఈమె పెరుమాళ్ళకు నాయకి కావున ఆయన సొత్తు అంతా ఈమెదే )అంతా పక్షికే ఇస్తే వీరు ఎక్కడ ఉంటారని ఒకరికి సందేశము వచ్చినది” ఆ పక్షి చూపిన చోటే ఉంటారు” అని అనంతాళ్వాన్ అందముగా అన్నారు.
  • తిరువాయ్మొళి 6.8.1  నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పాశురంలో నమ్మాళ్వార్ , పెరుమాళ్ళకు “ఎన్ తిరుమగళ్ శేర్ మార్బన్” అన్నారు (శ్రీ మహాలక్ష్మి నివస స్థానము) అనంతాళ్వాన్ తమ కూతిరికి “ఎన్ తిరుమగళ్” అని పేరు పెట్టుకొని  పవిత్రమైన మాతల మీద తన ప్రేమను చాటుకున్నారు.
  • వార్తామాలై – 345 – భట్టర్ ఒక సారి తన  శిష్యులలో ఒకరిని శ్రీవైష్ణవుల లక్షణాలను తెలుసుకొనుటకు అనంతాళ్వాన్  వద్దకు పంపించారు. వీరు వెళ్ళే  సమయానికి   అనంతాళ్వాన్  తిరుమాళిగలో తదీయారాధన జరుగుతుంది. పంక్తిలో కూర్చోగానే మరొక శ్రీవైష్ణవుల కోసం వీరిని లేపారు. ప్రతి పంక్తిలోను అలాగే జరిగింది. ఆఖరికి అనంతాళ్వాన్తో కూర్చొని ప్రసదమును స్వీకరించారు వారు. అప్పుడు అనంతాళ్వాన్ ఆ శ్రీవైష్ణవుల గురించి వివరములను అడిగారు. తాము భట్టర్ శిష్యులమని, శ్రీవైష్ణవుల లక్షణాలను తెలుసు కొనుటకు భట్టర్ తమ వద్దకు పంపిచారని చెప్పారు.

దానికి అనంతాళ్వాన్ ” కొక్కై పోలిలే, కోలియై పోలిలే, ఉప్పై పోలిలే, ఉమ్మైపోలిలే ఇరుక్కు వేండం” అని చెప్పారు. అంటే కొంగ లాగ అవకాశం వచ్చే వరకు ఆగడం, కోడి లాగా సారతమమైన పదార్థాలను మాత్రమే తీసుకోవడం, ఉప్పు లాగా తన ఉనికిని చాట కుండా అన్నింటా ఉండాలి” అని చెప్పారు. ఆఖరికి మాలాగా అన్నారే దాని అర్థం ఏమిటని అడిగారు, “ప్రతి పంక్తిలోను కూర్చున్న మిమ్ములను  లేపినా మీరు కోపగించు కోక ఓపికగా ఉన్నారు. ఇలాగే శ్రీవైష్ణవులకు ఓపిక ఉండాలి” అని చెప్పారు.

తిరువేంకటాదీశుని కృప అనంతాళ్వాన్పైన ఈనాటికి అపారముగా ఉన్నది. వారి వీరి అవతారోత్సవమైన మేష మాసములో చిత్తా నక్షత్రం నాడు, వారి పరమపదోత్సవమైన కర్కాటక మాసం పూర్వఫల్గుణి  నక్షత్రం నాడు తిరువేంకటాద్రీశుడు అనంతాళ్వాన్ తోటకు విచ్చేసి తన శేషమాలను,  శ్రీశఠగోపమును అనుగ్రహించే సాంప్రదాయం ఇప్పటికిని కొనసాగుతున్నది

ananthazwan-magilatree

ఈ వ్యాసములో  అనంతాళ్వాన్ వైభవము  కొంతవరకు మాత్రమే తెలుకున్నాము. మన మీద వారి అపార కృపా కటాక్షములు సదా ప్రసరించాలని ప్రార్థన చేద్దాం.

ananthazhwan-thirumalai

అనంతాళ్వాన్  తనియన్:

అఖిలాత్మ గుణవాసం అఙ్ఞాన తిమిరాపహం|
ఆశ్రితానాం సుశరణం వందే అనంతార్య దేశికమ్||

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజ దాసి

మూలము : http://acharyas.koyil.org/index.php/2013/03/31/ananthazhwan-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org